ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక..!

233
- Advertisement -

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లను వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. లేనిపక్షంలో ఈ ఏడాది డిసెంబర్ 1,2018 నుంచి వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని పేర్కొంది. ఇచ్చిన గడువు తేదీలోగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లను రిజిస్టర్ చేయించుకోవాలని వినియోగదారులకు సూచించింది.

SBI

 

ఖాతాదారుల బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.

- Advertisement -