మొక్కలు నాటిన ఎంపీ విజయసాయిరెడ్డి

422
Mp Vijaya Sai
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖపట్నంలోని రిషికొండలోఉన్న GVMC పార్క్ లో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరు.. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక మనిషి మూడు మొక్కలు నాటితే… తన జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్ ను అవి అందిస్తాయని తెలిపారు. సాగర తీరాన ఉన్న విశాఖ ను ప్రకృతికి పర్యావరణానికి చిరునామాగా మారుస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్, GVMC కమిషనర్ శ్రీజన , ప్రముఖ హీరో నాగార్జున, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ లకు మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.

- Advertisement -