గ్రీన్ ఛాలెంజ్..గొప్ప కార్యక్రమం: వైసీపీ ఎంపీ

334
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం అని కొనియాడారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

మొక్కలు లేనిది మానవాళి లేదని..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక్క మహత్తర ఉద్యమంగా మారి బంగారు తెలంగాణ లో భాగంగా హరిత తెలంగాణ ,పచ్చటి తెలంగాణగా మారుతుందన్నారు.

మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ తో పాటుగా తెలంగాణ చక్కటి,పచ్చటి తెలంగాణ కావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. దీనికి ప్రజల సహకారం ఉండాలని ఆకాంక్షించిన ఆయన మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారుఉ. హీరో బాలకృష్ణ ,సినీ నిర్మాత అశ్విన్ దత్త ,మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వర్ నాథ్ కు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.

ycp mp ycp mp

- Advertisement -