గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే..

372
green challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇవాళ ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా లోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు.

ఈ సందర్భం గా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోని మంచి ఆక్సిజన్ కావాలి అంటే 15 నిమిషాల కి 300 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలాంటి పరిస్థితి మనకు రావద్దు అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటలి అని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపుతున్నా రోజా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మన జీవితానికి సరిపడే ఆక్సిజన్ మూడు మొక్కల నుండి వస్తుంది ఆ మూడు మొక్కలు నాటి వాటిని పెంచి మన ఆక్సిజన్ మనం ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నిన్న తమిళనాడు లో , ఈ రోజు విశాఖపట్నం లో మొక్కలు నాటిస్తున్న ఎమ్మెల్యే రోజా గారిని ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -