వైఎస్‌..’యాత్ర’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌…

194
yathra
- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహీ వి రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకుంది. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకురానుంది.

1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు, రైతుల ఆవేదన తెలుసుకున్న వైయస్ జీవిత భాగంపై సినిమా తీయడం మరచిపోలేని అనుభూతి అని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. వైయస్ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించామని అన్నారు. వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు.

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -