అందుకే ఇండియా ఓడిపోయిందిః మెహబూబా ముఫ్తీ

389
Mehbooba-Mufti
- Advertisement -

ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీంఇండిమా పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. 31పరుగుల తేడాతో ఇండియాపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. 1992 తర్వాత ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్ జట్టు భారత్‌ను ఓడించింది.

ఈ ప్రపంచకప్ లో ఇండియాకు ఇది తొలి ఓటమి. ఇండియా ఓటమిపై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీంఇండియా ఓటమికి కారణం వాళ్లు ధరించిన జెర్సీయే కారణమన్నారు. జెర్సీ రంగు మారడం వల్లే భారత్ ఓడిపోయిందని ట్వీట్ చేశారు.

- Advertisement -