మహిళల టీ20 వరల్డ్‌కప్‌..భారత జట్టు ఎంపిక

532
india womens t20
- Advertisement -

ఆసీస్ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఫిబ్రవరి 21 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుండగా స్టార్‌ ప్లేయర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. 15 మంది సభ్యుల జట్టులో బెంగాల్‌ బ్యాట్స్‌విమన్‌ రిచా హోష్‌ మాత్రమే కొత్త ప్లేయర్‌ కావడం విశేషం.

హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకోగా హర్యానాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ తొలి వరల్డ్‌ కప్‌ ఆడనుంది.

టి20 ప్రపంచకప్‌కు భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెపె్టన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెపె్టన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనమ్‌ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి.

- Advertisement -