పెట్రోల్‌ అయిపోయిందని 100కు ఫోన్‌…

448
petrol
- Advertisement -

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ అయిపోయిందని ఓ యువతి చేసిన ఫోన్‌కు స్పందించారు పోలీసులు.

రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు ఫోన్ చేసింది. తన స్కూటీలో పెట్రోల్ అయిపోయిందని ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోల్ బాటిల్‌తో యువతి వద్దకు చేరుకుని వాహనంలో పోసి జాగ్రత్తలు చెప్పారు.

రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్‌‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Women calls Dial 100 for fuel need….Women calls Dial 100 for fuel need…Women calls Dial 100 for fuel need

- Advertisement -