హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2020

517
wings india
- Advertisement -

హైదరాబాద్ ప్రపంచస్ధాయి వైమానిక సదస్సుకు వేదికకానుంది. మార్చిలో బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే వింగ్స్ ఇండియా 2020 సదస్సు సన్నాహాక సమావేశం ఈ నెల 9న జరగనుండగా ఇందులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ. ఈ సన్నాహక సమావేశంలో పౌరవిమానయాన శాఖతో పాటు కేంద్ర వ్యాపార వాణిజ్య శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమని….వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమం దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందని హర్‌దీప్ సింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్ లైన్స్, విమాన తయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వైమానిక రంగ నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

ఈ ఏడాది మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా ఈ ‘వింగ్స్ ఇండియా-2020’ కార్యక్రమం జరగనుంది.

- Advertisement -