- Advertisement -
కరోనా వ్యాధి కేసులు పెరుగుతున్న దశలో ఎటువంటి వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించనున్నదో చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లాక్డౌన్ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించారు. లాక్డౌన్ విఫలమైన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందన్నారు.
భారత్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆరోపించిన రాహుల్ …నాలుగు దశల లాక్ డౌన్లో ఎలాంటి ప్రగతి జరగలేదన్నారు.
కోవిడ్ సంక్షోభం, లాక్డౌన్తో పాటు ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహుల్… మే నెల చివర వరకు వైరస్ తగ్గుదల ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్నదని, కానీ వైరస్ కేసులు పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -