భారత్‌తో టీ20 సిరీస్‌…వెస్టిండీస్ జట్టు ఇదే

539
west indies cricket team
- Advertisement -

త్వరలో టీమిండియా…విండీస్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. విండీస్‌తో టూర్‌ సందర్భంగా టీ20,వన్డే,టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది భారత్‌. ఈ మేరకు టీమిండియా ఎంపిక ఎప్పుడో పూర్తవగా తాజాగా తమ టీ20 జట్టును ప్రకటించింది విండీస్ యాజమాన్యం.

చాలాకాలం తర్వాత వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లు సునీల్ నరైన్,ఆల్‌రౌండర్ రస్సెల్,పోలార్డులకు బోర్డు నుంచి పిలుపువచ్చింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల కోసం నరైన్‌, పొలార్డ్‌లకు అవకాశం కల్పించారు.

ఆగస్టు 3న తొలి టీ20,4న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్ స్ధానంలో జాన్ క్యాంప్ బెల్‌ని ఎంపిక చేశారు మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్‌ కీపర్‌ ఆంథోని బ్రాంబెల్‌ ఒక్కడే అరంగేట్ర ఆటగాడు కావడం విశేషం.

విండీస్‌ టీ20 జట్టు సభ్యులు

కార్లోస్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), నరైన్‌, కీమో పాల్‌, ఖారీ పీర్‌, కీరన్ పొలార్డ్‌, పూరన్‌, రోవ్‌మన్‌, ఆండ్రీ రస్సెల్, థామస్‌, ఆంథోనీ, క్యాంప్‌బెల్‌, కాట్రెల్‌, హెట్‌మెయర్‌, ఎవిన్‌ లూయిస్‌

- Advertisement -