విండీస్‌ను చిత్తుచేసిన భారత్..

626
india vs westindies
- Advertisement -

వెస్టిండీస్ ఉమెన్స్‌తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా భారత ఉమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సిరీస్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసి విండీస్‌ను చిత్తుచేసింది. గురువారం చివరిదైన ఐదో టీ20 జరగనుంది.

గయానా వేదికగా ప్రొవిడెన్స్ స్టేడియంలో వర్షం కారణంగా జరిగిన మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఉమెన్స్ జట్టు 7 వికెట్లు కొల్పోయి 50 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్‌ ఒక్కరే 10 పరుగులతో రెండంకెల స్కోరు నమోదుచేయగా మిగితా ఆటగాళ్లు విఫలమయ్యారు. మాథ్యూస్(3),ఫ్లెచర్‌(2),గ్రిమ్మండ్(2) వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 9 ఓవర్లలో 5 వికెట్ల కొల్పోయి 45 పరుగులు చేసింది. భారత ఉమెన్స్ బౌలర్లలో అనుజ పాటిల్(2),దీప్తి శర్మ(1),రాధిక యాదవ్(1) తలో వికెట్ తీశారు. విండీస్ ఆటగాళ్లలో మాథ్యూస్(11),హెన్రీ(11) పరుగులు చేశారు.

rain-hit 4th T20I in Providence, India spinners led by Anuja Patil restricted West Indies to 45 for 5 after having set the hosts a target of 51 from 9 overs.

- Advertisement -