భారత్-పాక్ డ్రెస్‌లో క్రిస్ గేల్.. ఫోటో వైరల్

434
Chris Gayle
- Advertisement -

ఇండియా పాకిస్దాన్ మధ్య మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యచ్ కోసం సర్వం సిద్దమైంది. ఈరెండు దేశాల అభిమానులే కాకుండా వెస్లిండిస్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా ఈమ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు. ఈసందర్భంగా ఆయన ఇండియా పాకిస్ధాన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు . ఇండియా, పాక్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యేకమైన డ్రెస్‌ తో తయారు చేయించుకుని, దాన్ని ధరించి ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టాడు.

అందులో కుడి వైపు భారత పతాకంలోని మూడు రంగులు, ఎడమ వైపు పాక్‌ జెండా రంగైన ఆకుపచ్చ రంగుతో ఈ డ్రస్ కనిపిస్తోంది. తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 20న కూడా ఇవే దుస్తులను తాను ధరిస్తానని క్యాప్షన్ పెడుతూ, గేల్ ఈ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఐపీఎల్‌ తో పాటు ఐసీఎల్‌ లనూ ఆడుతున్న గేల్‌ కు రెండు దేశాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/ByuuaFQFO7_/

- Advertisement -