మొక్కలు నాటిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

397
Mla Nannapaneni Narendar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అధ్బుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మొక్కలు నాటారు. వరంగల్ ఆర్ ఈ సీ ఏరియా లోని తార గార్డెన్ లో 3 మొక్కలు నాటారు.

ఈసందర్బంగా ఎమ్మెల్యే నన్నపనేని మాట్లాడుతూ… నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఇంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పది వేల మొక్కలు నాటాను అని , కానీ సంతోష్ కుమార్ లక్ష్యం పది కోట్ల మొక్కలు నాటే వరకు నా వంతుగా ఎక్కడ కార్యక్రమం జరిగిన మొక్కలు నాటుతానని తెలిపారు.

mla Nananpaneni

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం లో భాగంగా అడవులు పెంచడం వల్ల దేశానికి ఆదర్శంగా ఉంది అని , దీని వల్ల భవిష్యత్ తరాలకు చక్కటి ఆక్సిజన్ అందుతుంది అని అన్నారు . ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ సవాల్ మరో ముగ్గురికి విసిరారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ , వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ లకు ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు.

- Advertisement -