మొక్కలు నాటిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

396
Green Chaleange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ఈగ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోంటున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ విసిరిన సవాల్ స్వీకరించారు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.

ఈరోజు ఉదయం కలెక్టర్ ఆఫీస్ లో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. ఎంపీ సంతోష్‌ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. మొక్కలు పెంచడం సమాజానికి చాలా అవసరం అన్నారు.

- Advertisement -