ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కొత్త అవతారం- కర్నె ప్రభాకర్‌

478
karne prabhakar
- Advertisement -

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్‌ నాయకులంగా పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం గులాబీ సైన్యం కదం తోక్కుతోంది. ఈ రోజు ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే భాస్కర్ రావు సూర్యాపేటలోని పాలంకీడులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త అవతారం ఎత్తుతారు. పద్మావతి గెలిస్తే హుజూర్‌నగర్‌కు కొత్తగా ఒరిగేది ఏందో ఉత్తమ్ చెప్పాలి. సైదిరెడ్డి గెలిస్తే నియోజకవర్గ నికి లాభం అని ప్రభాకర్‌ అన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్‌నగర్‌ అభివృద్ధిపై దాస్యలేదు..నిత్యం రాజకీయం చేయడం అలవాటు అయ్యింది. ఒకసారి సీఎం అని..ఇంకోసారి కేంద్ర మంత్రి అని ఓట్లు అడిగినవ్..ఇప్పుడు ప్రజలు నీకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

Karne

 

ప్రజల మోసం చేయడమే ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు..కానీ ఈ ఎన్నికల్లో పని చేయదు. డబ్బులు పంచుడు అలవాటు ఉత్తమ్‌కు ఉన్నట్లుగా.. అందరికి ఉంటది అనుకుంటే పొరపాటే. 2014లో సూర్యాపేటలోని వాహనంలో కోట్ల రూపాయలు దొరికింది వాస్తవం కదా…? అని కర్నె ప్రభాకర్‌ ప్రశ్నించారు. సైదిరెడ్డి కెనెడాకు పోవుడు కాదు… పద్మావతి ఓడిపోయి తన తల్లిగారు అయిన గద్వాలకు వెళ్లడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌.

ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ..ఉత్తమ్ కుమార్ రెడ్డి పగటి పూట ప్రచారం కంటే..రాత్రి పూట ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ డబ్బులు పంపిణీ చేస్తూ…టీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం 10 లక్షల అభివృద్ధి చేశాడా….? కానీ సైదిరెడ్డి 58 కోట్ల మినరల్ ఫండ్స్‌తో అభివృద్ధి పనులు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాయ మాటలు చెప్పి…పబ్బం గాడుపుకున్నావ్ ఇప్పుడు ఇగా సాగవు. అని ఎమ్మెల్యే భాస్కర్‌ రావు అన్నారు.

- Advertisement -