నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌–7…

499
pro kabaddi league
- Advertisement -

ప్రో కబడ్డీ లీగ్ సీజన్‌ 7 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఈ సారి టోర్నీలో 12 జట్లు పాల్గొంటుండగా తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో యు ముంబా తలపడనుంది. మూడు నెల‌ల పాటు జ‌రిగే క‌బ‌డ్డీ లీగ్ కి అభిమానులు ప్రతి ఏటా పెరుగుతున్నార‌ని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారుల‌కు వారి ప్రతిభ‌ను చాటేందుకు ఇలాంటి వేదిక‌లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.

హైదరాబాద్, ముంబయి, పాట్నా, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, పూణే, జైపూర్, పంచకుల(హర్యానా),గ్రేటర్ నోయిడా ల్లో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. లీగ్ మ్యాచ్ లు అక్టోబర్ 11 తో ముగుస్తాయి. అనంతరం అక్టోబర్ 14 న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లు, 16 న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి ఫైనల్స్ అక్టోబర్ 19 న నిర్వహిస్తారు.

ఆరేళ్ళ క్రితం 2014లో 8 టీములతో మొదటి ప్రో కబడ్డీ ప్రారంభం అయింది. తెలుగు టైటాన్స్ రెండు సార్లు సెమీఫైనల్స్ కు చేరగా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది.

- Advertisement -