విశాఖ టెస్టు..కోహ్లీ సేన ఇదే

638
umesh yadav
- Advertisement -

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ డ్రా ముగియగా టెస్టు సిరీస్‌ను గెలిచేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది కోహ్లీ సేన. అయితే భారత పేస్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం అవడంతో కోహ్లీ సేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే బుమ్రా స్ధానంలో పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ని తీసుకున్నారు.

41 టెస్టుల్లో 119 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ చివరిగా 2018లో పెర్త్ వేదికగా ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. తాజాగా బుమ్రా గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో ఉమేష్‌కి చోటు దక్కింది. అక్టోబరు 2 నుంచి విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టు పుణే,మూడో టెస్టు రాంచీలో జరగనుంది.

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (రెండో వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్, ఉమేశ్ యాదవ్

- Advertisement -