కరోనా నియంత్రణకు విరుష్క సాయం..

629
- Advertisement -

కరోనాపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారు. కేంద్రానికి వారి వారి రాష్ట్రాలకు చేతనైనంత ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇక కరోనా నియంత్రణకు అవసరమైన నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ‘పీఎం-కేర్స్ ఫండ్’ ను ప్రారంభించి, విరాళాలను కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించారు. ఇందులో భాగంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

పీఎం-కేర్స్ ఫండ్‌కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. “నేను, అనుష్క పీఎం-కేర్స్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయనిధి (మహారాష్ట్ర)కి మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది పడుతున్న బాధను చూసి మా హృదయాలు చలించిపోయాయి. ఈ మా సహాయం బాధలో ఉన్న వారికి కొంతవరకైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను” అని విరాట్ ట్వీట్ చేయగా, ఇదే ట్వీట్ ను అనుష్క కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

- Advertisement -