విరాట్ అనే నేను… హామీ ఇస్తున్నా…

245
virat Kohli
- Advertisement -

ఐపీఎల్-11లో హాట్ ఫేవరేట్‎గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‎లో కనీసం ప్లే ఆఫ్‎కి కూడా చేరకుండానే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా పోస్టు చేశాడు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ప్లే ఆఫ్‎కు చేరకుండా వెనుతిరిగినందుకు అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. ఈ వీడియోలో తమ జట్టు ఓటమి గల కారణాలు, వచ్చే ఐపీఎల్ లో తమ జట్టు వ్యూహాలపై గురించి వివరించాడు.

Virat Kohlo and ABD

హాయ్.. ఆర్సీబీ అభిమానులందరికీ ఈ వీడియో ద్వారా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా… ఈ ఐపీఎల్ సీజన్‎లో గొప్ప ప్రదర్శన చేయలేక పోయాం, మా ఆట తీరు మిమ్మల్ని బాధించింది. అభిమానులు మా మీద పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకోలేదు, అందుకు నా క్షమాపలు అంటూ వీడియోలో తెలియజేశాడు.

ఈ నేపథ్యంలో వీడియో పోస్టు చేస్తూ… కామెంట్ కూడా పెట్టాడు. మీరు గెలుస్తారు లేదా నేర్చుకుంటారు అనే భావనను నిజంగా నమ్ముతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ సీజన్‎లో చేసిన తప్పులను వచ్చే సీజన్‎లో మళ్లీ జరగకుండా.. వాటిని పాఠాలుగా నేర్చుకొని, కచ్చితంగా మేము బలమైన జట్టుగా బరిలోకి దిగుతాం. అభిమానులు జాగ్రత్త అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆర్సీబీలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్ననపటికీ… ఇంతవరకు ఒక్కసారి కూడా చాంపియన్‎గా నిలవకపోవడం విశేషం.

- Advertisement -