‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి లుక్‌..

782
Vijayashanti
- Advertisement -

సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 13 ఏళ్ల అనంతరం మళ్లీ మేకప్ వేసుకుంటున్న ఆమెకు దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు చిత్రయూనిట్ ఘనస్వాగతం పలికింది. కాగా ఆమె సెట్‌లో అడుగు పెట్టారంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ ట్వీట్‌ చేశారు.

‘13 ఏళ్ల తర్వాత.. ఇది విజయశాంతి మేడమ్‌కు మేకప్‌ టైమ్‌. ఈ 13 ఏళ్ల విరామంలో ఆమెలో ఎటువంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, ప్రవర్తన, ధీరత్వం. స్వాగతం మేడమ్‌’ అని పోస్ట్‌ చేశారు. ఇదే సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా విజయశాంతికి ట్విటర్‌ వేదికగా స్వాగతం చెప్పారు. అందుకు విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు.

mahesh

“అనిల్ రావిపూడి గారు, మహేశ్ బాబు గారు మీరు సాదర స్వాగతం పలకడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఓ వ్యక్తి ఔన్నత్యం ఏంటో ఆ వ్యక్తి దృక్పథమే చెబుతుంది. క్లైమేట్ మారొచ్చేమో కానీ ఆటిట్యూడ్ మాత్రం మారదు… అది మీ విషయంలోనైనా, నా విషయంలోనైనా!” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, సినిమాలోని తన గెటప్ తాలూకు ఫొటో కూడా పోస్టు చేశారు.

ఇటీవల మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రైలు షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -