రోజాపై సానుభూతి…సొంతపార్టీ నేతలకు రాములమ్మ చురకలు

460
vijayashanthi
- Advertisement -

సినిమా,రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్నారు విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న విజయశాంతి పార్టీ ఓటమి తర్వాత పెద్దగా స్పందించిన సందర్భం లేదు. అయితే తాజాగా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది రాములమ్మ.

ఏపీ సీఎం జగన్‌ తన కేబినెట్‌లోకి నగరి ఎమ్మెల్యే రోజాను తీసుకుంటే బాగుండేదని తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో రోజా విషయంలో జగన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని ఆశీస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఓ వైపు రోజాపై సానుభూతి ప్రకటిస్తూనే సొంతపార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రాములమ్మ. తనను కేవలం ప్రచారానికే వాడుకుంటున్నారని పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని చురకలంటించారు. మరి విజయశాంతి చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

- Advertisement -