మహేశ్ బాబుకు నో చెప్పిన రాములమ్మ..

257
mahesh vijayashanthi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈచిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం మే9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈమూవీ తర్వాత మహేశ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయనున్నాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇటివలే ఎఫ్ 2 చిత్రంతో ఘన విజయం సాధించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈమూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక ఈమూవీలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి నటించనున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే రాజకీయాల్లోకి వెళ్లి ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు . అయితే విజయశాంతిని మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసారు అనిల్ రావిపూడి . గతంలో కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కొడుకు దిద్దిన కాపురం చిత్రం లో విజయశాంతి ,మహేష్ బాబు నటించారు అందులో విజయశాంతి హీరోయిన్ కాగా మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషించాడు . విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి కూడా దాదాపు 30సంవత్సరాలు కావోస్తుంది. ఇప్పుడు మళ్లీ మహేశ్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఉన్న సమాచారం ప్రకారం విజయశాంతి మహేశ్ కు నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం నటనపై తనకు అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసిందట. పైగా ఆమె క్రీయాశీలక రాజకీయాల్లో ఉండటం వల్ల రిస్క్ తీసుకోలేదని అంటున్నారు సినీ వర్గాలు. ఇక మరో స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈసినిమాలో నటించేందుకు నో చెప్పాడని తెలుస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి వీరి స్దానంలో ఫైనల్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి మరి.

- Advertisement -