రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు విజయ్. ఈచిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా, రాశీఖన్నా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈమూవీని విడుదల చేయనున్నారు. కాగా నిన్న ఈమూవీ టీజర్ ను విడదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ లో విజయ్ దేవరకొండ మారింది. విజయ్ తన పేరులో మార్పు చేసుకున్నాడు. విజయ్ దేవరకొండను కాస్త దేవరకొండ విజయ్ సాయి అని చేంజ్ చేసుకున్నాడు. కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్తో ఆయన ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నారు అభిమానులు. కాగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ప్లాప్ కావడంతో ఆయన ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.