ఉపరాష్ట్రపతికి అత్యున్నత పౌర పురస్కారం..

476
Venkaiah Naidu
- Advertisement -

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కామొరోస్‌ అత్యున్నత పౌరపురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ను శుక్రవారం అందుకున్నారు. కామొరోస్‌ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్యనాయుడు ఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా ఆఫ్రికా దేశం కొమొరోస్‌లో ఉపరాష్ట్రపతి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రిసెంట్’ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, 130 కోట్ల భారతీయుల తరపున గౌరవాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు. భారత్-కామొరోస్ మైత్రికి గుర్తుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని, సంయుక్త లక్ష్యమే తమను కలిపిందని, పరస్పర పురోగతి స్వప్నమిదని పేర్కొన్నారు.

- Advertisement -