టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీలు చేయాలంటే ముందు వరుసలో ఉండే హీరో విక్టరీ వెంకటేష్. గత కొద్దికాలంగా ఈ దగ్గుబాటి బాసు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వెంకీ ఇదివరకే మహేశ్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్తో ‘గోపాల గోపాల’,చిత్రాలలో నటించి ఆకటుకున్నారు.
తాజాగా వరుణ్ తేజ్తో కలసి నటించిన ‘ఎఫ్2’ సినిమాతో వెంకీ భారీ హిట్ అందుకున్నాడు. మరోవైపు నాగచైతన్యతో కలసి ప్రస్తుతం ‘వెంకీ మామ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని మల్లీస్టారర్ మూవీలు చేసేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు.
అయితే ఇదే ఊపుతో వెంకటేష్ మరో మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమౌతున్నాడని సమాచారం. ఈ మూవీకి వీరు పోట్ల దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అంతేకాదు వెంకీ కోసం కథను కూడా సిద్ధం చేశాడట ఈ దర్శకుడు. ఇక ఈ చిత్రంలో వెంకీతో కలసి మాస్ మహారాజా రవితేజ నటించనున్నారని తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎప్పుడు పట్లాలెక్కనుంది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.