క్రిస్మస్ కానుకలను పంపిణీచేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

615
vemula prashanth reddy
- Advertisement -

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీముగల్ మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్ సోదరీమణులకు చీరలు పంపిణీ చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం తోనే తాను మంత్రిని అయ్యానని చెప్పారు. తాను పదవి లో ఉన్నంత కాలం ఏళ్ల వేళలా శక్తికి కి మించి పని చేసి మీ రుణం తిర్చుకుంటానని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిచాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు పెద్ద పీట వేసిందని పేద క్రిస్టియన్‌లకు బట్టలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో చర్చిల అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు.

vemula prashanth reddy distributes christamas gifts..vemula prashanth reddy distributes christamas gifts

- Advertisement -