అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ఎల్పీలో వీలినం:వనమా

340
vanama
- Advertisement -

నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నామని కోత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తెలిపారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని అనంతరం మాట్లాడిన ఆయన సీఎల్పీని టీఆర్ఎస్‌లో వీలినం చేయమని సీఎం కేసీఆర్‌ని కోరామని,స్పీకర్‌ని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.ప్రజల ఆకాంక్ష మేరకు నడచుకుంటామని పరిషత్ ఎన్నికలలో టీఆర్ ఎస్ కు ఏకీగ్రీవంగా మద్దతు పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరానని తెలిపారు పినపాక ఎమ్మెల్యే రేగ కాంతరావు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలం టీఆర్ఎస్‌లో వీలినం అయ్యామని చెప్పారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

- Advertisement -