నాతో పందెం కట్టకండి…చస్తారు:వరుణ్ తేజ్

447
varun tej
- Advertisement -

14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం ‘వాల్మీకి’.షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రేపు హైదరాబాద్ శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా విక్టరీ వెంకటేష్ రానున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం స్పెషల్ వీడియోని విడుదల చేశారు వరుణ్ తేజ్. సినిమాలోని డైలాగ్ నాతో పందెం కట్టకండి…చస్తారు అంటూ డైలాగ్ చెప్పి అందరిని ఆకట్టుకున్నారు.

ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు వరుణ్ తేజ్. అధర్వ మురళి కీలక పాత్రలో నటించగా ఈ సినిమాను 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -