ఆదిలాబాద్ ఎస్పీ సవాల్‌ స్వీకరించిన ఉట్నూర్ ఏఎస్పీ..

921
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగానే రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియర్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఉట్నూర్ ఏఎస్పి శభరిష్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు.

asp shabarish

ఉట్నూర్ పోలిస్ స్టేషన్ ఆవరణలో పలు రకాల మూడు మొక్కలు నాటి ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను మరో ముగ్గురు అధికారులకు చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సిఐ నరేష్, ఎస్ఐ సుబ్బారావ్ మరియు టి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ఉట్నూర్ కోప్షన్ సాజిద్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

green india challenge

ఈ సందర్భంగా ఉట్నూర్ ఏఎస్పి డాక్టర్ శభరీష్ మాట్లాడుతు.. పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చెపట్టడం జరిగిందని, జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను తాను స్వీకరించి ఉట్నూర్ పొలిస్ స్టేషన్ ఆవరణలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురు అధికారులు తన భార్య స్నేహలత ఐఏఎస్ ప్రత్యేక అధికారి మంచిర్యాల మరియు తన ఇద్దరు మిత్రులు వినిత్ ఐపిఎస్, గౌషాలం ఐపిఎస్ హైదరాబాద్ లను నామినేట్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రం పచ్చగా విల్లివిరియాలని అందరు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి ముందుకు వెళ్లి ప్రకృతిని కాపాడాలని ఏఎస్పి శభరిష్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -