దివ్యాంగులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉంది

312
harish
- Advertisement -

దివ్యాంగులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని రాజ్‌భవన్ రోడ్‌లోని రూట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, కృత్రిమ అవయవాలను మంత్రి పంపిణీ చేశారు.

harish

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్యూర్ సంస్థ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేస్తున్న సేవకు అభినందనలు తెలిపారు. దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదన్నారు. అలా చిన్న చూపు చేసే వారిలోనే లోపం ఉందన్నారు. డబ్బులు బాగా సంపాదించేవారు కొంత స్వార్థం మాని సమాజానికి సాయం చేయాలని పిలుపునిచ్చారు.

దివ్యాంగుల పెన్షన్ రూ.300నుంచి రూ.3వేలకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. అదేవిధంగా ఉద్యోగాల రిజర్వేషన్లలో 3 శాతం నుంచి 4 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో 70 శాతం శారీరక వైకల్యం ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 40 శాతం ఉన్నా అన్నా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తున్నామన్నారు.

- Advertisement -