సేజిస్‌తో ప్రభుత్వ ఎంవోయు..

382
vinod kumar
- Advertisement -

రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధి లో సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సేజిస్ అనే సంస్థ తో ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు అందుకున్నారు .

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఈ ఎంవోయూ ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయ పడ్డారు.# ఈ కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, ప్లానింగ్ శాఖ డైరెక్టర్ షేక్ మీరా కూడా పాల్గొన్నారు.

అంతకముందు ట్రాన్స్ ఫార్మింగ్ స్టేట్ ఎఫెక్టివ్ నెస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై బుధవారం ఖైరతాబాద్ లోని అర్థ గణాంక శాఖ కార్యాలయంలో జరిగిన సెమినార్ లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి టీ. హరీష్ రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, నీతి ఆయోగ్ సలహాదారుడు మురళీధరన్ కార్తికేయన్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు జీ.ఆర్.రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు పాల్గొన్నారు.

- Advertisement -