ఇది తెలంగాణ ప్రజల విజయంః మంత్రి కేటీఆర్

467
ktr
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్నతలు తెలిపారు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తు వచ్చిందన్నారు.

2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. మున్సిపల్‌ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని కేటీఆర్‌ చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. కాగా 120మున్సిపాలిటిలకు గాను 111మున్సిపాలిటిల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -