పొట్టకూటి కోసం సౌదీకి వెళితే తనను చిత్ర హింసలు పెడుతున్నారని ఓ వీడియో ద్వారా తెలిపాడు ..రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎండి సమీర్ అనే యువకుడు . బ్రోకర్ చేసిన మోసానికి ఆ యువకుడు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈసందర్భంగా అతను ఓ వీడియో తీసి తన కష్టాలను చెప్పుకున్నాడు. బాధితుడు మాట్లాడుతూ..తనను ఏజెంజ్ మోసం చేశాడు. ఫాం హౌస్ లో పని చేయాలని చెప్పి నాతో గొర్రెలు కాపిస్తున్నారు. ఏజెంట్ నా దగ్గరి నుంచి రూ.83వేల రూపాయలు తీసుకుని నన్ను మోసం చేశారు. నెలకు 1200 జీతం ఇస్తా అని చెప్పారు కానీ నాకు రూపాయి కూడా ఇవ్వడం అదే. అన్నం తినక 20 రోజులు అయింది. నేను ఇండియా వెళ్లి పోతాను అంటే నన్ను కొడుతున్నారు…తంతున్నారు. ఇక్కడే ఉండాటంటూ బెదిరిస్తున్నారు.
నన్ను ఎలాగైనా ఇండియాకు తీసుకు వెళ్లండి అన్నా..ఇక్కడ ఉంటే నన్ను సంపుతున్నారు అన్నా..కేటీఆర్ అన్నా నన్ను ఎలాగైనా మీరే కాపాడాలన్నా.. అంటూ వేడుకున్నాడు. ఈవీడియో ను చూసి స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సౌదీలో ఉన్న ఇండియా ఎంబసీకి సమీర్ గురించి చెప్పారు. సమీర్ ను ఇండియాకు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు. ఇక కేటీఆర్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశాడు ఈవీడియోను షేర్ చేసిన వ్యక్తి. మీ మానవత్వ హృదయానికి శతకోటి నమస్కారాలు సార్…మా ఇల్లంతకుంట తరుపున మీకు రుణపడి ఉంటాం అని ట్వీట్ చేశారు.
#కేటిఆర్_అన్న_నన్ను__కాపాడుండ్రీ#సౌదీలో_నన్నుసంపుతుండ్రు#రంజాన్_లో_ఉపవాసం_నాకు_చివరిమాసంగ ఉంది #సౌదీలో ఎజెంట్ మోసంతో నరకయాతన పడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెంది ఎండి సమీర్ అనే యువకుడు.తనను అదుకోవాలని అర్థనాదలు @KTRTRS @BTR_KTR pic.twitter.com/rVoDYXNStq
— Marupaka Anil Kumar MAK (@kumar_marupaka) May 14, 2019
Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019