మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం

441
harishrao
- Advertisement -

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈసందర్భంగా వారికి మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా ఉండి సీఎం కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుందామని సూచించారు. పార్టీకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పని చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపించాలని కోరారు. త్వరలోనే కాళేశ్వరం నుంచి మీ భూముల్లోకి నీళ్లు వస్తాయని..గజ్వేల్ లో పంట పోలాలన్ని సస్యశ్యామలంగా మారుతాయని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

- Advertisement -