హుజుర్‌నగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే: పోచంపల్లి

634
mlc pochampally srinivasreddy
- Advertisement -

హుజుర్‌ ఉప ఎన్నికలో టిఆర్ ఎస్ విజయం ఖాయమైనట్లేనన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మంచి మెజారిటీతో టిఆర్ ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. హు జూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నెరేడుచర్ల రామాపురంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి..టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ కి బాసటగా నిలిచి, హుజుర్ నగర్ ని బహుమతిగా ఇవ్వనున్నారన్నారని తెలిపారు.

మూడుసార్లు గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఉత్తమ్ కి వేస్తే తమ ఓట్లు ఉత్తగానే పోతాయని హు జూ ర్ నగర్ ప్రజలు గ్రహించారని ఎద్దేవా చేశారు.టిఆర్ఎస్‌కి ఓటు వేయడంతో తమ అభివృద్ధికి తాము ఓటు వేసుకోవడమే అన్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన ఆమోఘంగా ఉందన్నారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ప్రజలు ముక్తకంఠంతో సైదిరెడ్డి ని గెలిపిస్తామంటున్నారని చెప్పారు.

- Advertisement -