రికార్డ్ బ్రేక్ చేసిన సైదిరెడ్డి..

491
saidi reddy
- Advertisement -

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితంలో కారు దూసుకుపోతుంది. కారు వేగాన్ని కాంగ్రెస్‌ అదుకోలేకపోతుంది. ఇప్పటి వరకు వెల్లడైన 15 రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి రికార్డ్ ని బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు 7 సార్లు జరిగిన హుజుర్‌నగర్‌ నియోజకవర్గ ఫలితాల్లో అత్యధిక మెజారిటీని 2009 ఎన్నికల్లో 29194 సాధించారు.ఇదే అత్యధిక మెజారిటీగా నమోదు అయింది. ఈ రికార్డ్ ని సైదిరెడ్డి 15 వ రౌండ్ లొనే అధిగమించారు.

saidireddy

14వ రౌండ్‌లో 26,999, 15వ రౌండ్‌లో 29,967 ఓట్ల మెజార్టీ వచ్చింది.. కాగా 16వ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 32,256 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సైదిరెడ్డి. మరో 6 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కాగా, ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన సైదిరెడ్డి.. 50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన పోలింగ్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు.

- Advertisement -