మొక్కలు నాటిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

440
green
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు జోగినిపెళ్లి అజిత్ కుమార్ విసిరిన చాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు.

ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌ కుమార్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని.. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు తన బర్త్ డే కు గిఫ్ట్ లు తెకుండా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం చాలా సంతోషకరమన్నారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఆలోచనకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తన పుట్టిన రోజున కూడా ఇదేవిధంగా వేడుకలు చేసుకోకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తామని పిలుపునిచ్చారు‌. ఈ సందర్భంగా తన మిత్రులు ముగ్గురుని మొక్కలు నాటాలని కోరారు1) రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి TRS పార్టీ ప్రధాన కార్యదర్శి 2) రమేష్ రెడ్డి TRSLP కార్యదర్శి 3) సత్య చరణ్ రావు లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -