ఆ రెండు స్ధానాల‌కు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిన టీఆర్ఎస్

259
trs
- Advertisement -

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ 117 స్ధానాల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఇద్ద‌రు అభ్య‌ర్దుల‌ను కూడా ప్ర‌క‌టించారు పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్. కోదాడ అసెంబ్లీ స్ధానం నుంచి ఇటివ‌లే పార్టీలో చేరిన బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్, ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్ కు టికెట్లు ఖరారు చేశారు. మొత్తం 119స్దానాల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసింది టీఆర్ఎస్. మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కోదాడ‌లో బొల్లం మ‌ల్లయ్య యాద‌వ్ నామినేష‌న్ వేయ‌నున్నారు. అలాగే హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి చేతుల మీదుగా ముఠా గోపాల్ రేపు బీ ఫామ్ తీసుకుని నామినేష‌న్ వేయ‌నున్నారు.

- Advertisement -