ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

704
kcr delhi
- Advertisement -

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీ విమానాశ్రయంలో పూల బొకేతో స్వాగతం పలికారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఎంపీలు బడుగు లింగయ్య , బాండ ప్రకాష్ ఉన్నారు. కేసీఆర్‌తో ఢిల్లీకి వెళ్లిన వారిలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ , పార్లమెంట్ సభ్యులు నమ నాగేశ్వర్ రావు ఉన్నారు.

శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

రెండోసారి ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీతో కేసీఆర్ భేటీ కావడంఇదే తొలిసారి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు.

- Advertisement -