ఎంపీ వినోద్ ప్రారంభించిన ప్రచార రథాలు..

425
B Vinod Kumar
- Advertisement -

కరీంనగర్‌లో జిల్లా అంతటా లోక్‌ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మిగిలిన పార్టీలతో పోలిస్తే అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ తరఫున కరీంనగర్‌లో ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ ప్రచారం నేపథ్యంలో కరీంనగర్‌లో రూపొందించిన ఎన్నికల ప్రచార రథాలను ఎంపీ వినోద్‌కుమార్ తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో డిజిటల్ తెరతో ఉన్న ప్రచార వాహనాలతో పాటు సైకిళ్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వాహనాలు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని వివరించారు.

- Advertisement -