సామాజిక సేవలో టీఆర్ఎస్ నేతలు..

274
coronavirus
- Advertisement -

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ సైతం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తుండగా ప్రజా ప్రతినిధులు,టీఆర్ఎస్ నేతలు రంగంలోకి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా ఇవాళ టీఆర్ఎస్ యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్యర్యంలో హైదరాబాద్ లోని చందానగర్‌,భవాని నగర్ లో పలువురికి మాస్కులు,శానిటైజర్లతో పాటు ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, చాడ కిరణ్ కుమార్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇక గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ యువజన విభాగం సీనియర్‌ నాయకుడు పాటిమీది జగన్మోహన్‌రావు అత్యవసర రోగికి రక్తదానం చేసి మంత్రి కేటీఆర్‌ నుంచి ప్రశంసలు అందుకున్నారు. పంజాగుట్ట నిమ్స్‌లో బైపాస్‌ సర్జరీ చేయించుకోనున్న హరికృష్ణకు ఓ నెగిటివ్‌ రక్తం అవసరం ఏర్పడింది. దీంతో సోమవారం పంజాగుట్ట నిమ్స్‌కు వెళ్లి రక్తదానంచేశారు. విపత్కర పరిస్థితుల్లో రక్తదానంచేయడంతో వెల్‌డన్‌ జగన్‌ అంటూ కేటీఆర్‌ అభినందించారు.

- Advertisement -