టీఆర్ఎస్ హవా..కౌంటింగ్‌పై కేటీఆర్ ఆరా

232
trs
- Advertisement -

అంతా ఉహించినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్ల పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారు. ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏకంగా 44 మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది. రెండు కార్పొరేషన్లను సైతం టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. మహబూబాద్‌ జిల్లా మరిపెడలోని మొత్తం 15 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు.

తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల ఫలితాల సరిళిని ఆరా తీస్తున్నారు మంత్రి కేటీఆర్. 10గంటల వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో పెద్దపల్లి, వర్ధన్నపేట, మహబూబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. తుది ఫలితాలు వెల్లడైన తర్వాత సాయంత్రం టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశంకానున్నట్లు సమాచారం.

- Advertisement -