కరీంనగర్‌లో టీఆర్ఎస్ ప్రభంజనం..

423
karimnagar trs
- Advertisement -

కరీంనగర్ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 60 డివిజన్లకు గాను రెండు ఏకగ్రీవం కాగా 58 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 27 స్ధానాల్లో గెలుపొందగా మరో 6 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ 11, ఎంఐఎం 4 చోట్ల గెలుపొందింది.

ఎన్నికల ఫలితాలను చూస్తే టీఆర్ఎస్ మేయర్ స్దానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమైపోయింది. మొదటగా చేపట్టిన పోస్టల్ బ్యాలెట్స్‌ లెక్కింపులో టీఆర్ఎస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 501 పోస్టల్ బ్యాలెట్స్‌ ఓట్లు పోల్ అవగా.. వాటిలో టీఆర్ఎస్‌కు 207 ఓట్లు, బీజేపీకి 126, కాంగ్రెస్‌కు 9, ఇతరులకు 90 ఓట్లు వచ్చాయి.

- Advertisement -