రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలుః మాజీ ఎంపీ కవిత

382
TRS MP Candidate Kavitha
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని మరోసారి రుజువు అయింది. టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు కవిత అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీల్లో గెలుపొందటంతో తెలంగాణ భవన్ లో సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.

 Kavitha Twitter

- Advertisement -