క‌రోనా…పెద్ద ఎత్తున స్పందిస్తున్న స్టార్స్

290
kamal
- Advertisement -

క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో షూటింగ్స్ లేక ఇంటికే ప‌రిమిత‌మైన సినీ కార్మికుల‌ని ఆదుకునేందుకు టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ పెద్ద ఎత్తున ముందుకువ‌స్తున్నారు.

ఇప్ప‌టికే నితిన్ ఏపీ,తెలంగాణ ప్రభుత్వాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున అంద‌జేయ‌గా తాజాగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ముందుకువ‌చ్చారు. ప‌ది ల‌క్ష‌ల చొప్పున ఏపీ,తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు త‌న‌వంతు సాయంగా అంద‌జేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక కోలీవుడ్‌లో ఇప్ప‌టికే రజనీకాంత్‌, విజయ్‌ సేతుపతి, సూర్య, కార్తీ వంటి హీరోలు భారీ విరాళాలు అందజేయగా తాజాగా కమల్‌ హాసన్‌, ధనుష్‌, శంకర్‌ విరాళాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. కమల్‌ హాసన్‌ రూ.10లక్షలు, ధనుష్‌ రూ. 15 లక్షలు, శంకర్ రూ.10 లక్షలు ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్ర‌క‌టించారు .

క‌మ‌ల్ ఒక‌డుగు ముంద‌కేసి మక్కల్‌ మయ్యంలోని వైద్యులతో కలిసి తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలని భావిస్తున్నా. ప్రభుత్వం అనుమతిస్తే అలా చేసేందుకు సిద్దంగా ఉన్నానని కమల్‌ ప్రకటించారు.

- Advertisement -