త్రిషకు వార్నింగ్ ఇచ్చిన నిర్మాతల మండలి

466
Trisha
- Advertisement -

ప్రముఖ హీరోయిన్ త్రిషకు హెచ్చరికలు జారీ చేసింది నిర్మాతల మండలి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గోనడం లేదని త్రిషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పరమపదం విళైయాట్టు’ . తిరుజ్ఞానం తెరకెక్కించిన ఈచిత్రం 28న విడుదల కానుండగా, నిన్న చెన్నైలోని సత్యం థియేటర్ లో యూనిట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ అందరూ హాజరయ్యారు కానీ త్రిష రాకపోవడంపై కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గోనాలని లేదంటే తీసుకున్న పారితోషకం సగం తిరిగి ఇచ్చేయాలని లేకుంటే తమిళ చిత్రాల్లో నటించకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించారు.

- Advertisement -