చంద్రముఖి…మిస్సింగ్

212
chandra mukhi
- Advertisement -

హైదరాబాద్‌ గోషామహల్ నియోజకవర్గ బీఎల్‌ఎఫ్ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్-2లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న చంద్రముఖి కనిపించడంలేదని ఆమె స్నేహితులు, బీఎల్‌ఎఫ్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

చంద్రముఖి తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్‌ ట్రాన్స్‌జెండర్‌ సమితి కార్యకర్త.  హిజ్రాలపై జరుగుతున్న దురాగతాలపై పోరాటం చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడేందుకు  బీఎల్‌ఎఫ్‌ తరపున బరిలోకి దిగారు.

తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన తొలి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి కావడం గమనార్హం. గోషామహల్ నుంచి టీఆర్ఎస్ తరపున ప్రేమ్ సింగ్ రాథోడ్, బీజేపీ తరఫున రాజా సింగ్, కూటమి తరఫున ముఖేశ్ గౌడ్ బరిలో ఉన్నారు.

- Advertisement -