మొక్కలు నాటిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్

407
Bellamkonda
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి స్పూర్తిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే నాలుగు కోట్ల మైలు రాయిని పూర్తి చేసుకున్న ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం మరింత విజయవంతంగా కొనసాగుతుంది.

Bellamkonda Srinivas

తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన పుట్టిన రోజు సందర్భంగా లాంకో హిల్స్ సమీపంలో మొక్కను నాటారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మొక్కలు నాటడం మన బాధ్యత అని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నభా నటేశ్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -