దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌…టాలీవుడ్ సెలబ్రిటీల హర్షం

528
jr ntr
- Advertisement -

గ‌త నెల 27న దిశ‌ని అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేసిన న‌లుగురు నిందితులు ఆరిఫ్‌, శివ‌, న‌వీన్, చెన్న‌కేశ‌వులను ఇవాళ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో భాగంగా చ‌టాన్ ప‌ల్లి ఘ‌ట‌నా స్థ‌లానికి నిందితుల‌ని తీసుకురాగా, వారు ఎదురు దాడి చేయ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు.

disha case

అయితే ఈ ఎన్‌కౌంట‌ర్‌పై దిశ త‌ల్లిదండ్రుల‌తో పాటు యావత్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. సినీ సెల‌బ్రిటీలు జూనియ‌ర్ ఎన్టీఆర్, నాగార్జున‌, స్మిత‌, మంచు మ‌నోజ్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. దిశ కేసులో న్యాయం జ‌రిగింది అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేయగా దిశ ఆత్మకి శాంతి చేకూరింది…అంటూ నాగ్ పేర్కొన్నారు.

ఇక నిందితులను కాల్చిన బుల్లెట్టు దాచుకోవాలని ఉందని పేర్కొన్నారు మంచు మనోజ్‌. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మనోజ్ …ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది…ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..??ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

- Advertisement -